మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేవకర్తో సమావేశమయ్యారు.రాష్ట్రంలోని పలుప్రాజెక్టుల నిర్మాణాలకోసం పర్యావరణ అనుమతులు మంజూరు చేసినందుకు కేంద్రమంత్రి ప్రకాష్ జవదేవకర్ను సిఎం కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు. సిఎం కెసిఆర్తో పాటు రాజ్యసభసభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్, కె.కేశవరావు, పార్లమెంట్ సభ్యులు కొత్తప్రభాకర్ రెడ్డి, నామానాగేశ్వర్ రావు, మన్నె శ్రీనివాస్ రెడ్డి,బిబి పాటిల్ కేంద్రమంత్రి జవదేవకర్ను కలిశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గౌరవార్థం మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన విందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొన్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమైన సిఎం కెసిఆర్ బుధవారం రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.
CM KCR Meet with Minister Prakash Javadekar