- Advertisement -
హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో శనివారం సాయంత్రం 4గంటలకు సిఎం కెసిఆర్ బహిరంగ సభ జరుగనుంది. జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కాసేపట్లో సభ ప్రారంభం కానుంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. 150 డివిజన్ల నుంచి బహిరంగ సభకు జనం భారీగా తరలివస్తున్నారు. ఈ సభలో సిఎం కెసిఆర్ ఆరేళ్లుగా హైదరాబాద్ లో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించనున్నారు. బహిరంగ సభను దిగ్విజయం చేసేందుకు టిఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. దీంతో ఎల్బీ స్టేడియం పరిసరాలు గులాబీ మయం అయ్యాయి. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని గులాబీ శ్రేణులు చెబుతున్నారు.
CM KCR Meeting On LB Stadium
- Advertisement -