Thursday, April 25, 2024

రేపు ఎంపిలతో సిఎం కెసిఆర్ సమావేశం

- Advertisement -
- Advertisement -

CM KCR meeting with TRS MPs tomorrow

హైదరాబాద్: టిఆర్ఎస్ ఎంపిలతో ముఖ్యమంత్రి కెసిఆర్ శనివారం సమావేశం నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతిభవన్ లో ఎంపిలతో బేటీ కానున్నారు. జూలై 18 నుంచి పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా ఎంపిలతో చర్చించనున్నారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన విధానంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని సిఎం పిలుపునివ్వనున్నారు. తెలంగాణపై వివక్షను ఎత్తిచూపేలా ఎంపిలకు నిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ధాన్యం కొనుగోలుపైనా పోరాడాలని ఎంపిలకు సూచించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News