Thursday, April 25, 2024

బిపిన్ రావత్ మరణం పట్ల సిఎం కెసిఆర్ సంతాపం

- Advertisement -
- Advertisement -

CM KCR mourns Bipin Rawat's death

హైదరాబాద్:  జనరల్ బిపిన్ రావత్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖ్‌రావు సంతాపం ప్రకటించారు. హెలికాప్టర్ ప్రమాదంలో రావత్‌తో పాటు ఆయన సతీమణి, పలువురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రక్షణ రంగానికి బిపిన్ రావత్ చేసిన సేవలను సిఎం కెసిఆర్ స్మరించుకున్నారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

బిపిన్ రావత్ మృతి పట్ల ఎంఎల్‌సి కవిత దిగ్భ్రాంతి

త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ మృతి పట్ల టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతో పాటు 11 మంది సైనిక సిబ్బంది మృతి చెందడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కవిత ట్వీట్ చేశారు. ఈ నష్టాన్ని భరించే శక్తిని, మృతుల కుటుంబాలకు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు ఆమె అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News