- Advertisement -
హైదరాబాద్: మాజీ అటార్జీ జనరల్, పద్మవిభూషణ్ సొలి జహంగీర్ సొరాబ్జీ కరోనాతో చికిత్సపొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 91 ఏళ్లు. సోలి సొరాబ్జీ మృతి పట్ల తెలంగాణ సిఎం కెసిఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు సిఎం ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కాగా, ఇటీవల ఆయనకు కరోనా సోకింది. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సొలి సొరాబ్జీ 1930లో ముంబయిలో జన్మించారు. సొలి జహంగీర్ సొరాబ్జీ మృతిపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సిజెఐ జస్టిస్ రమణలతో పాటు పలువురు న్యాయకోవిదులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.
- Advertisement -