Tuesday, April 16, 2024

వెలపాటి రామరెడ్డి మృతిపట్ల సిఎం కెసిఆర్ సంతాపం

- Advertisement -
- Advertisement -

CM KCR mourns the death of Velapathi Rami Reddy

హైదరాబాద్: తెలంగాణ పద్యకవి, ప్రభుత్వ విశిష్ట పురస్కార గ్రహీత వెలపాటి రామరెడ్డి మృతిపట్ల సిఎం కెసిఆర్ సంతాపం వ్యక్తం చేశారు. దివంగత వెలపాటి రామరెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. వ్యవసాయం, రైతు సమస్యలపై తన కవిత్వం ద్వారా ఆవిష్కరించిన రైతుకవి వెలపాటి అని కొనియాడారు. తెలంగాణ వస్తువును కవిత్వాంశంగా చేసుకొని రచనా వ్యాసాంగాన్ని సాగించిన వెలపాటి మరణంతో తెలంగాణ ఉత్తమ సాహితీవేత్తను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ కవి వెలపాటి రామిరెడ్డి (89) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News