Saturday, April 20, 2024

నోములకు కెసిఆర్ నివాళి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: దీర్ఘకాలిక అనారోగ్యంతో హైదరాబాద్‌లో మంగళవారం మృతిచెందిన ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ నాయకులు నాగార్జున సాగర్ శాసన సభ్యులు నోముల నర్సింహయ్య అంత్యక్రియలు అధికార లాంఛనాల మధ్య గురువారం ఆయన స్వగ్రామం పాలెంలో ముగిశాయి.దివంగత ఎమ్మెల్యే అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో పాటు మంత్రులు రాష్ట్ర,జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు అధికారులు హాజరయ్యా రు.అంతకు ముందు నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రిలో భద్ర పరచిన ఆయన భౌతిక కాయానిన తెల్లవారున నకిరేకల్‌లో నోముల నర్సింహయ్య ఇంట్లో కడసారి చూపు కోసం కొద్దిసేపు ఉంచిన అనంతరం నకిరేకల్ నుండి ప్రారంభమైన నోముల అంతిమ యాత్ర పాలెం గ్రామ సమీపంలో ఆయన వ్యవసాయ క్షేత్రం వరకు భారీ ఎత్తున తరలివచ్చిన పార్టీ నాయకులు,అభిమానులతో కొనసాగింది.ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హెలికాప్టర్‌లో 11.50 నిమిషాలకు పాలెం చేరుకుని అక్కడే ఎదురుగా ఉన్న దహన సంస్కారాలు నిర్వహించే ప్రదేశానికి నడుచుకుంటూ వచ్చారు.నోముల నర్సింహయ్య పార్థివ దేహంపై సిఎం పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించి ఎమ్మెల్యే కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.కన్నీటి పర్యంతమవుతున్న కుటుంబ సభ్యులను ఓదార్చారు.పోలీసుల గౌరవ వందనంతో గాలిలోకి కాల్పులు జరిపిన అనంతరం కుమారుడు భరత్ కుమార్ తండ్రి చితికి నిప్పంటించారు.

ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యా సాగర్, మంత్రులు జగదీష్‌రెడ్డి, మహమూద్ అలీ తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటెల రాజేందర్, వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర రైతు బంధు అధ్యక్షులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్‌లు బండ నరేందర్‌రెడ్డి, సందీప్‌రెడ్డిలు, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, శాసన సభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గాదరి కిషోర్, రవీంద్ర కుమార్, పైళ్ల శేఖర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డిఐజి, ఎస్.పి.ఏ.వి.రంగనాథ్, అదనపు కలెక్టర్‌లు రాహుల్ శర్మ, వి.చంద్రశేఖర్, అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనీ ప్రతిమా సింగ్, వెంకట్‌రాంరెడ్డి, ఆర్‌డిఓ జగదీశ్వర్‌రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు రాంచంద్రనాయక్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పూల రవీందర్, మాజీ శాసన సభ్యులు వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, తెలంగాణ యాదవ ఆఫీషియల్స్ అండ్ ప్రోఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.బి.కృష్ణాయాదవ్, వెంకట్ య ఆదవ్, దోతీ నాగరాజ్ యాదవ్, ఓం యాదవ్, కొండల్ యాదవ్, అధికారులు భౌతిక కాయానికి నివాళులు అర్పించి సంతాపం తెలిపారు.

CM KCR pays Tribute to Nomula Narsimhaiah

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News