Saturday, April 20, 2024

కట్టుదిట్టంగా లాక్ డౌన్‌

- Advertisement -
- Advertisement -

CM KCR

 

ప్రజలకు నిత్యావసరాల కొరత రాకుండా చూడండి
రేషన్ షాపుల వద్ద ప్రజలు సహకరించాలి
రూ.1500 చొప్పున నగదు జమకు శ్రీకారం
యథావిధిగా వరి కోతలు, ధాన్యం కొనుగోళ్లు
సహాయ కార్యక్రమాలు సాఫీగా సాగాలి
ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సిఎం కెసిఆర్ సమీక్ష

హైదరాబాద్: కరోనా వ్యాప్తిని నిరోధించడానికి అమలు చేస్తున్న లాక్ డౌన్‌ను ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలను కోరారు. కరోనా వైరస్ సోకిన వారిని అగమేఘాలపై గుర్తించి చికిత్స అందించడం, వారితో కలిసిన వారిని కూడా త్వరగా గుర్తించి క్వారంటైన్ చేయాలన్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ నిత్యావసరాలకు కొరత రాకుండా చూడాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వరికోతలు, ధాన్యం ఇతర పంటల కొనుగోళ్లు యథావిధిగా జరపాలని చెప్పారు.

కరోనా వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, లాక్ డౌన్ అమలు, వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు తదితర అంశాలపై సిఎం కెసిఆర్ శుక్రవారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్ రావు, రామకృష్ణ రావు తదితరులు పాల్గొన్నారు.

కరోనా వైరస్ లక్షణాలున్న వారికి పరీక్షలు జరుపుతున్నామని, శుక్రవారం కొత్తగా 16 మందికి పాజిటివ్ వచ్చిందని ఈ సందర్భంగా అధికారులు సిఎం కెసిఆర్‌కు వివరించారు. పాజిటివ్ వచ్చిన వారందరికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. పాజిటివ్ కేసులు ఎక్కువయినప్పటికీ అందరికీ చికిత్స చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు సిఎం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, అధికారులకు పలు సూచనలు చేశారు. లాక్ డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. దేశంలో, రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు కావడం వల్లనే వైరస్ ఇతర దేశాల మాదిరిగా ఎక్కువగా విస్తరించడం లేదన్నారు.

ఈ సత్యాన్ని గ్రహించి ప్రజలు సహకరించాలని కోరారు. లాక్ డౌన్ సందర్భంగా పాలు, పండ్లు, కూరగాయలు, మందులు, మాంసం తదితర విక్రయాలు యథావిధిగా జరిగే విధంగా చూడాలని కోరారు. ఈ షాపుల వద్ద జనం ఒకే దగ్గర పోగు కాకుండా దూరం పాటించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రేషన్ షాపుల ద్వారా నియంత్రిత పద్ధతిలో జరుగుతున్న ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రేషన్ షాపుల యజమానులు చెప్పిన సమయానికి వచ్చి బియ్యం తీసుకోవాలన్నారు.- ప్రభుత్వం చెప్పిన విధంగా తెల్ల రేషన్ కార్డున్న ప్రతి కుటుంబానికి రూ.1500 చొప్పున నగదును బ్యాంకు అకౌంటులో వేసే కార్యక్రమం శుక్రవారం నుంచి ప్రారంభమైందని సిఎం తెలిపాకు.

త్వరలోనే అందరికీ డబ్బులు అందుతాయన్నారు. గ్రామాల్లో వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేసిన కేంద్రాలను సరిగ్గా నిర్వహించాలన్నారు. రైతులు చెప్పిన సమయానికే వచ్చి, తమ ధాన్యం అమ్ముకోవాలని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాలు, ఇతర చోట్ల వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలను, సహాయ కార్యక్రమాలను అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో జరిగే వీడియో కాన్ఫరెన్సులో ప్రస్తావించాల్సిన అంశాలు, మధ్యాహ్నం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చకు పెట్టాల్సిన అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.

 

CM KCR review meeting on coronavirus
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News