Friday, March 29, 2024

ఏదైనా ఎదుర్కొందాం

- Advertisement -
- Advertisement -

kcr

 

కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్రంలో లాక్ డౌన్ బాగా అమలవుతోంది. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. రానున్న రోజుల్లోనూ ఇదే స్ఫూర్తి కొనసాగాలి. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఈ నెల 20 వరకు యథావిధిగా లాక్ డౌన్ అమలవుతుంది. ఆ తర్వాత పరిస్థితిని బట్టి మార్పులకు అవకాశం ఉంటుంది. కరోనా కేసుల ఆధారంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 259 కంటైన్మెంట్లు ఏర్పాటు చేసి, పకడ్బందీగా వైద్యం సేవలను అందిస్తున్నాం. వైరస్ వ్యాప్తి జరగకుండా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కరోనాపై యుద్ధానికి సర్వసన్నద్ధం

ఎంత మందికైనా నిర్ధారణ పరీక్షలు, చికిత్సకు ఏర్పాట్లు

20 వేల పడకలు సిద్ధం చేసి ఉంచాం
20 తర్వాత లాక్‌డౌన్‌లో మార్పులు, చేర్పుల పరిశీలన
ప్రస్తుతం 2.25లక్షల పిపిఇ కిట్లు ఉన్నాయి, త్వరలో 5లక్షల పిపిఇ కిట్లు వస్తాయి, మరో 5 లక్షలకు ఆర్డర్
ప్రస్తుతం 3.25లక్షలు ఎన్95 మాస్క్‌లు, త్వరలో 5 లక్షలు వస్తాయి, మరో 5లక్షలకు ఆర్డర్
లక్షమందికి పాజిటివ్ వచ్చినా చికిత్స
నిరుపేదలకు చెప్పినవన్నీ ఇచ్చేశాం
ప్రజాప్రతినిధులు, అధికారుల పనితీరు అద్భుతం
ప్రగతిభవన్ ఉన్నతస్థాయి సమావేశంలో సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంత మందికైనా కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించడానికి, వైరస్ సోకిన వారికి చికిత్స అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వసిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 20 వరకు తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ యథావిథిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. లాక్ డౌన్ అమలు, నిరుపేదలక సాయం అందించే విషయంలో ప్రజాప్రతినిథులు చూపిస్తున్న చొరవ, ప్రజల సహకారం కొనసాగాలని సిఎం ఆకాంక్షించారు.

కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, వైరస్ సోకిన వారికి అందుతున్న సాయం, లాక్ డౌన్ అమలు, పేదలకు అందుతున్న సాయం, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు తదితర అంశాలపై సిఎం కెసిఆర్ బుధవారం ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు తదితరులు పాల్గొన్నారు.

కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించడానికి చేసిన ఏర్పాట్లు, అందుతున్న చికిత్స, భవిష్యత్ అవసరాల కోసం తీసుకుంటున్న చర్యలను ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 514 మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు, చికిత్స పొందుతున్న వారిలో బుధవారం ఎనిమిది మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని, మరో 128 మంది గురువారం డిశ్చార్జి కానున్నారని వివరించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్ డౌన్ బాగా అమలవుతున్నదని చెప్పారు. ప్రజలు ఎంతగానో సహకరిస్తున్నారని, రానున్న రోజుల్లో కూడా ఇలాగే సహకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఈ నెల 20 వరకు యథావిధిగా లాక్ డౌన్ అమలవుతుందన్నారు.

ఆ తర్వాత పరిస్థితిని బట్టి మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందని, ప్రజలు ఇప్పటిలాగానే సహకరించాలన్నారు. కరోనా వైరస్ సోకిన వారి ఆధారంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 259 కంటైన్మెంట్లు ఏర్పాటు చేసి, పకడ్బందీగా వైద్యం సేవలను అందిస్తున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు. వైరస్ వ్యాప్తి జరగకుండా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

వైద్య పరీక్షలకు అన్ని రకాల కిట్లు సిద్దం
ఎంతమందికైనా సరే, వైరస్ నిర్థారిత పరీక్షలు నిర్వహించడానికి కావాల్సిన టెస్ట్ కిట్స్ సిద్ధంగా ఉన్నాయని సిఎం కెసిఆర్ తెలిపారు. రాష్ట్రంలో పిపిఇ కిట్లకు ఏమాత్రం కొరతలేదని, ఇప్పటికే 2.25 లక్షల పిపిఇ కిట్లు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ఈ సంఖ్య కొద్ది రోజుల్లోనే 5 లక్షలకు చేరుకుంటుందని, మరో 5 లక్షల పిపిఇ కిట్లకు ఆర్డర్ ఇచ్చామని వెల్లడించారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రం 10 లక్షల పిపిఇ కిట్లను సమకూర్చుకున్నట్లు అవుతుందన్నారు. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం 3.25 లక్షల ఎన్…95 మాస్కులున్నాయని, త్వరలోనే ఈ సంఖ్య 5 లక్షలకు చేరుకుంటుందని అన్నారు.

మరో 5 లక్షలకు కూడా ఆర్డర్ ఇచ్చామని సిఎం పేర్కొన్నారు. దీంతో తెలంగాణలో 10 లక్షల ఎన్ 95 మాస్కులు అందుబాటులో ఉంటాయన్నారు. వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలు, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది, ఆసుపత్రులు, బెడ్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయన్నారు. 20 వేల బెడ్స్ ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని, లక్ష మంది పేషెంట్లు అయినా సరే, చికిత్స చేయడానికి అవసరమైన ఏర్పాట్లు ప్రభుత్వం చేసి పెట్టిందన్నారు. కరోనాపై యుద్ధానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది అని ముఖ్యమంత్రి ప్రకటించారు.

ప్రజాప్రతినిధులు బాగా పనిస్తున్నారు
లాక్ డౌన్ అమలును, పేదలకు అందుతున్న సాయాన్ని, పంటల కొనుగోలు విధానాన్ని ప్రజాప్రతినిధులు ఎంతో చొరవ తీసుకుని బాగా పర్యవేక్షిస్తున్నారన్నారని సిఎం కెసిఆర్ ప్రశంసించారు. సర్పంచులు, మున్సిపల్ చైర్ పర్సన్లు, మేయర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంఎల్‌ఎలు, బాగా పనిచేస్తున్నారు. ఈ పని ఇంకా కొనసాగాలి…. ప్రజలను చైతన్య పరచాలన్నారు. ప్రభుత్వ పరంగా జరుగుతున్న కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని ఆయన సూచించారు. ఆరోగ్య, మున్సిపల్ మంత్రులు తప్ప మిగతా మంత్రులు, ఎంఎల్‌ఎలు తమ జిల్లాలు, నియోజకవర్గాల్లోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి కోరారు.

లబ్ధిదారులకు సాయం అందుతోంది
్ద లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో ఎవరూ ఆకలితో అలమటించవద్దనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నదని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. బాగా కష్ట పడుతున్న వారికి నగదు ప్రోత్సాహకాలు ప్రకటించిందని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ గుర్తు చేశారు. అవన్నీ అందాల్సిన వారికి అందుతున్నాయన్నారు. ప్రతి పేద కుటుంబానికి రూ. 1500 చొప్పున నగదు అందించాలనే నిర్ణయం మేరకు బ్యాంకు అకౌంట్లలో డబ్బులు వేశామన్నారు. ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం అందే కార్యక్రమం దాదాపు పూర్తయిందన్నారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రకటించిన ముఖ్యమంత్రి ప్రత్యేక నగదు ప్రోత్సాహం, వైద్య సిబ్బందికి ప్రకటించిన 10 శాతం అదనపు వేతనం కూడా వారికి అందిందని సిఎం తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యం కార్యక్రమాలు నిరంతరరాయంగా జరగాల్సి ఉన్నందున రాష్ట్రంలోని గ్రామ పంచాయతీకు ఏప్రిల్ నెల కోసం రూ.308 కోట్లు , అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు కలిపి రూ. 148 కోట్లు విడుదల చేశామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

 

CM KCR review on Coronavirus
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News