Friday, April 26, 2024

తుది రక్తపు బొట్టుదాకా పోరాడుతా

- Advertisement -
- Advertisement -

CM KCR review on Dalitbandhu in Karimnagar

తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధ పడినట్టే దళితబంధును విజయవంతం చేయడానికి గట్టిగా పట్టు పడతాను
దళితబంధుకు పరిమితి లేదు
ప్రతి దళిత కుటుంబం అభివృద్ధి చెందేవరకు పథకం
కొనసాగుతుంది ఇందుకోసం దశలవారీగా
రూ.లక్షా75వేల కోట్లు ఖర్చు చేస్తాం హుజూరాబాద్
నుంచి ప్రారంభమైన దళిత చైతన్య జ్యోతి
రాష్ట్రవ్యాపితంగా విస్తరించి దేశానికే వెలుగులు
పంచనున్నది : కరీంనగర్ కలెక్టరేట్‌లో దళితబంధు
అమలుపై సమీక్షలో సిఎం కెసిఆర్
దళితజాతి పేదరికంలో మగ్గిపోతూ సామాజిక వివక్షకు గురవడానికి సభ్య సమాజమే కారణం. ఎన్కట నుంచి ఎవరు పెట్టిండ్రోగాని ఇది దుర్మార్గమైన ఆచారం. ఇప్పటికైనా దళితుల పట్ల అనుసరిస్తున్న దురాచారాన్ని కట్టడి చేసి వారి ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి తెలంగాణ సమాజమంతా కలిసి రావాలి. పట్టుబడితే సాధించలేనిది ఏమీ లేదు. ముఖ్యమంత్రి కెసిఆర్ 

మనతెలంగాణ/హైదరాబాద్/కరీంనగర్: తన చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతానని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పషం చేసారు. ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళితబంధు విజయవంతం కోసం అంతే గట్టిగా పట్టుబడతానన్నారు. దళితజాతి పేదరికంలో మగ్గిపోతూ సామాజిక వివక్షకు గురవడానికి సభ్య సమాజమే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నట నుంచి ఎవరు పెట్టిండ్రోగాని ఇది దుర్మార్గమైన ఆచారమన్నారు. ఇప్పటికైనా దళితుల పట్ల అనుసరిస్తున్న దురాచారాన్ని కట్టడి చేసి దళితుల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి తెలంగాణ సమాజమంతా కదిలిరావాలని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. పట్టుబడితే సాధించలేనిది ఏమీ లేదని ఆయన మరోమారు పునరుద్ఘాటించారు.

పట్టుబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. అదే పట్టుదలతో స్వరాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. ఈ తరహాలోనే దళితుల సమగ్రాభివృద్ధి కూడా అంతే పట్టుదలతో సాధించుకుని తీరుతామన్నారు. పట్టుబడితే తప్పకుండా సాధించే లక్షణం తెలంగాణ సమాజం ప్రత్యేకతని సిఎం అన్నారు. దళిత బంధులో పరిమితి లేదని, ప్రతి దళిత కుటుంబం అభివృద్ధి చెందేంత వరకు పథకం కొనసాగుతుందన్నారు. ఇందుకోసం లక్షా డ్బ్బైఐదువేల కోట్లను దశల వారిగా వెచ్చించనున్నామన్నారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో శుక్రవారం సిఎం కెసిఆర్ అధ్యక్షతన దళితబంధు అమలుతీరుపై ఉన్నత స్థా యి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడు తూ ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామ న్నారు. తెచ్చుకున్న తెలంగాణను ఏడేండ్లలో అద్భుతంగా అభివృద్ధి చేసుకు న్నామన్నారు.

సాగు నీటి రంగాన్ని పునరుజ్జీవనం చేసుకున్నామని పేర్కొన్నా రు. దండగన్న వ్యవసాయాన్ని పండగ చేసుకున్నామన్నారు. కరెంటును ని రంతరాయంగా ఇచ్చుకుంటున్నామని తెలిపారు. ఒకనాడు కూలీ పనికి పోయిన రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించుకుంటున్నామన్నా రు. రాష్ట్రం వచ్చిన నాడు అర్థంకాని పరిస్థితుల నుంచి అర్థవంతమైన, గుణా త్మకాభివృద్ధి దిశగా తెలంగాణ అడుగులేస్తున్నదని సిఎం కెసిఆర్ అన్నారు. ఆకలి చావుల నుంచి అన్నపూర్ణగా ప్రస్తుతం రాష్ట్రం ఎదిగిందన్నారు. కునా రిల్లుతున్న కులవృత్తులను కోట్లాది రూపాయలు వెచ్చించి ఆర్థికంగా నిలబె ట్టుకున్నామన్నారు. గొర్రెల పెంపకం, చేపల పెంపకం, చేనేతకు ఆసరా, ఎంబిసిలకు అండగా ప్రభుత్వం నిలబడిందన్నారు. అన్ని రంగాల్లోనూ అన్ని వర్గాలకు అండదండలు అందిస్తూ, గత ఏడేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తాను న్నాననే ధీమాను స్ఫూర్తిని అందిస్తున్నదన్నారు.

సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎంపి జోగినపల్లి సంతో ష్ కుమార్, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంఎల్ ఎలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, మా జీ మంత్రి కడియం శ్రీహరి, ఎస్‌సి కార్పోరేషన్ చైర్మ న్ బండా శ్రీనివాస్, మాజీ ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్, సిఎంఒ కార్యదర్శులు స్మితా సభర్వాల్, రాహుల్ బొజ్జా, కలెక్టర్ కర్ణన్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, మాజీ మేయర్ రవీంద్రసింగ్, మాజీ ఎంఎల్ ఆరెపల్లి మోహన్, నా యకులు కౌశిక్ రెడ్డి, పెద్ది రెడ్డి, బ్యాంకర్లు, సంక్షేమ శాఖ అధికారులు, రాష్ట్ర, జిల్లా దళిత సంఘాల నేతలు మేడి మహే ష్, కంసాల శ్రీనివాస్, బొగ్గుల మల్లేశం, దుంపల జీవన్, గోసుకంటి అరుణ్, నల్లా కనకరాజు తదితరులు పాల్గొన్నారు

దళిత బంధుకు పరిమితి లేదు
రైతు బంధు ఆర్థిక సాయాన్ని ఉద్యోగస్తులు, వారు, వీరు అనే తేడా లేకుండా ఎట్లైతే పరిమితులు లేకుం డా అందిస్తున్నామో, అదే పద్ధతిలో దళిత బంధుకు కూడా పరిమితులు లేవని సిఎం కెసిఆర్ తెలిపారు. దళిత బస్తీలోని దరిద్రాన్ని బద్దలుకొట్టాలంటే ఉద్యో గస్తులకు కూడా దళిత బంధు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎస్‌సి వర్గాల్లోని అన్ని ఉప కు లాలకు దళిత బంధు వర్తిస్తుందని తెలిపారు. తెలం గాణ కోసం తాను కదిలిన నాడు…తన వెంట మీరంతా కదిలిండ్రు అన్నారు. రాష్ట్రాన్ని సాధించు కునే దాకా తన వెంట నడిచిండ్రు అని పేర్కొన్నారు. అలా గే రాష్ట్రం కోసం తాను కోట్లాడితే కూడా సహకరించిండ్రు అని సిఎం వ్యా ఖ్యానించారు. గత ఏడేళ్లుగా ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమానికి అండగా నిలబడుతు న్నారని అభినందించారు. తెలంగాణ పోరాటంలో మీ సహకారం నిజమైన దైతే. అభివృద్ధి కోసం అదే ఉ ద్యమ స్ఫూర్తితో తాను చేస్తున్న ఈ పోరాటానికి సైతం అంతే స్థాయిలో సం పూర్ణ సహకారం అందించాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

రైతు బంధు తదితర సహయ, సహకారాలు అందించి ఎట్లైతే వి వక్షకు గురైన తెలంగాణ వ్యవసాయ రంగాన్ని పట్టుబట్టి అభివృద్ధి పరుచుకు న్నామో, వివక్షకు గురౌతున్న తెలంగాణ దళిత జాతిని అభివృద్ధి చేసుకోవడం లో కూడా అదే సిద్ధాంతం ఇమిడి ఉన్నదని సిఎం అన్నారు. దండుగన్న వ్యవ సాయాన్ని పండుగలా మార్చడానికి, ఉజ్వలంగా వెలుగొందాలని ఎట్లైతే ప్ర భుత్వం ఆర్థికంగా ఊతం ఇచ్చిందో అదే పద్ధతిలో నిరాశ నిస్పృహలకు గురై న దళిత జాతి సముద్దరణకు కూడా ఆర్థికంగా అండదండలు అందితేనే వా రు తలెత్తుకొని సమాజంలో తిరుగుతూ గుణాత్మక జీవనాన్ని కొనసాగిస్తార నే, దార్శనికతతోప్రభుత్వం దళిత బంధు పథకాన్ని అమలు చేస్తుందన్నారు. హుజురాబాద్ నుంచి ప్రారంభమయ్యే దళిత చైతన్య జ్యోతి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి దేశానికే వెలుగులు పంచనున్నదని, అణగారిన దళిత వర్గాల్లో చైతన్యాన్ని తీసుకువస్తుందన్నారు. ఎట్లైతే స్పష్టమైన అవగాహనతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి గమ్యాన్ని ముద్దాడామో అంతే స్పష్టమైన అవగాహనతో దళిత బంధు ఉద్యమాన్ని నడిపించి, గమ్యాన్ని ముద్దాడుతా మని సిఎం స్పష్టం చేశారు.
లక్షా డ్బ్బై ఐదు వేల కోట్లను వెచ్చిస్తాం
సాగు నీటి రంగం ,వ్యవసాయ రంగానికి ఎట్లైతే లక్షలాది కోట్ల రూపా యలను ఖర్చు చేసి పునరుజ్జీవనం చేసుకున్నామని, అదే పద్ధతిలో లక్ష డబ్బై ఐదు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి యావత్తు రాష్ట్ర దళిత కుటుంబాల ను దశల వారీగా రాబోయో కాలంలో అభివృద్ధి పరుచుకుంటామని సిఎం కెసిఆర్ తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి ఏటా 20 నుంచి 30 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ 2 నుంచి 3 లక్షల దళిత కుటుంబాలకు దళిత బంధు కార్యక్రమాన్ని దశల వారీగా అమలుపరుస్తామన్నారు.

తెలంగాణ ఇప్పుడు ఒక దరికి చేరుకుంది
రైతుబంధు, రైతు బీమాతో రైతులకు వ్యవసాయానికి ఉపశమనాన్ని కలిగించామని సిఎం కెసిఆర్ అన్నారు. ప్రదానంగా గత వలసపాలనలో అన్ని రంగాల్లో గాడి తప్పిన తెలంగాణ నేడు ఒక దరికి చేరుకున్నదన్నారు. బిడి కార్మికులకు, ఒంటరి మహిళలకు, బోదకాలు బాధితులకు పెన్షన్ అందిస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. అలాగే కళ్యాణలక్ష్మి, కెసిఆర్ కిట్, అమ్మఒడి వాహనాలు వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు పరుస్తున్నాన్నారు. ఇప్పుడిప్పుడే అన్ని రంగాలను సరిదిద్దుకుంటూ, సవరించుకుంటూ ఒక దరికి చేరుకున్నామన్నారు. తాను ఎప్పటినుంచో అనుకుంటున్న దళిత అభివృధ్ది కార్యచరణకు ఇప్పుడు సమయం వచ్చిందని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. తాను సిద్దిపేట ఎంఎల్‌ఎగా వున్నప్పుడు ఆ ప్రాంతంలో దళిత చైతన్య జ్యోతి కార్యక్రమాన్ని చేపట్టి దళిత జాతి అభ్యున్నతి కోసం కృషి చేశానని అన్నారు. దళితబంధు గత సంవత్సరమే ప్రారంభమయ్యేది ఉండే, కానీ కరోనా కారణం చేత ఆలస్యమైందన్నారు.

దేశానికే పాఠం నేర్పే విధంగా..
ఇప్పుడు దళితబంధు మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టాం. త్వరలోనే దేశానికే పాఠం నేర్పే విధంగా దళిత బంధును నిలబెడతామన్నారు. దేశవ్యాప్తంగా దళితుల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఉత్తర భారతదేశంలో దళి తుల పరిస్థితిని చూస్తే, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ చలించిపోక తప్ప దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హుజురాబాద్‌లో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు పరుస్తున్న దళితబంధు కార్యక్రమాన్ని మీ అందరి సహకారంతో, తప్పకుం డా విజయవంతం చేస్తామన్నారు.

ఓట్ల కోసం చేపట్టిన కార్యక్రమం కాదు
సబాల్ట్రన్ స్టడీస్ సెంటర్ ఏర్పాటు చేసి దళితుల సామాజిక, ఆర్థిక స్థితిగతుల పట్ల అధ్యయనం చేశామని సిఎం కెసిఆర్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 165 జాతులు ఆర్థిక, సామాజిక వివక్షకు గురౌతున్నయనే విషయాన్ని అధ్య యనం ద్వారా తెలుసుకున్నామన్నారు. భారతదేశ దళితుల పరిస్థితి కూడా ఈ 165 జాతుల మాదిరిగానే ఉందనే విషయాన్ని నిర్ధారణ అయ్యిందన్నా రు. దళితులకు ఆస్తులు లేవు.. పైనుంచి సామాజిక వివక్ష కొనసాగుతోంద న్నారు. ఇది ఓట్ల కొసం చేపట్టిన కార్యక్రమం కాదని సిఎం మరోసారి స్పష్టం చేశారు. సమగ్ర కుటుంబ సర్వేలో రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని తేలిందన్నారు. దాదాపు 75 లక్షల దళిత జనాభా రాష్ట్రంలో ఉం దన్నారు. అంటే రాష్ట్ర జనాభాలో 18 శాతం దళితులు ఉన్నారని పేర్కొన్నా రు. దళిత జనాభా పెరుగుతున్నదని, దాని తగ్గట్లు రాబోయే కాలంలో వారి రిజర్వేషన్ల శాతం పెంచుకునే ప్రయత్నం చేద్దామన్నారు. అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు కార్యక్రమాన్ని అన్ని దళిత కుటుంబాలకు చేర్చేందుకు, ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి పరిచేందుకు దళిత మేధావి వర్గం నడుము బిగించాలని సిఎం విజ్ఞప్తి చేశారు.

పలు రంగాల్లో రిజర్వేషన్లు
దళిత బంధు పథకం ద్వారా అమలుపరుస్తున్న పలు కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాన్ని వెంట తీసుకొని వెళ్లి అందులో పొందుపర్చిన వివిధ వ్యాపార, ఉపాధి మార్గాలను వివరించాలని సిఎం కెసిఆర్ సూచించా రు. లబ్ధిదారులే స్వయంగా వారి పనిని ఎంచుకునేందుకు సహకరించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అదే సందర్భంలో అందరూ ఒకే పని కాకుండా భిన్నమైన పనులను ఎంచుకోవడం ద్వారా ఆర్థికంగా మరింతగా లబ్ధి పొందవచ్చునన్నారు. ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చే ఫర్టిలైజర్, మెడికల్, వైన్స్ తదితర రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు కలిపిస్తామన్నారు. కాంట్రాక్ట ర్ రంగంలో కూడా కొంత శాతం రిజర్వేషన్ కోసం ఆలోచన చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2 లక్షల 20 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, తద్వారా 15 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కా యన్నారు.

అదే పద్ధతిలో రూ. 1.75 లక్షల కోట్లను దళితులకు పెట్టుబడిగా పెట్టడం ద్వారా అది తిరిగి పునరుత్పాదకతను సాధిస్తుందని, లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను దళిత బంధు పథకం అందిస్తుందని సిఎం అన్నారు. గ్రామ,మండల,నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో దళిత బంధు కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు సిఎం తెలిపారు. దళిత బంధు కార్యక్రమం అమలుతో పాటు ఒక్కసారి అభివృద్ధి చెందిన కుటుంబం కిందపడకుండా రక్షణ నిధి సపోర్టివ్ స్ట్రక్చర్న్ ఏర్పాటు చేశామన్నారు. ఇటువంటి విధానం ప్రపంచంలోనే ఒకటి, రెండు చోట్ల ఉందన్నారు. అయితే దేశంలో మాత్రం ఇదే మొదటిదన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో దళిత బంధు కమిటీలు ఈ రక్షణ నిధిని పర్యవేక్షణ చేస్తాయని, ఆపద వచ్చిన వారిని ఆదుకొంటూ వారిని తిరిగి నిలబెడతాయని సిఎం తెలిపారు.

పలు సూచనలు జారీ
హుజురాబాద్‌లో దళిత బంధు పథకం పైలెట్ ప్రాజెక్ట్ అమలు తీరుతెన్నులపై అధికారులతో చర్చించిన సిఎం కెసిఆర్ అనంతరం పలు సూచనలు చేశారు. మొదటగా ప్రతి కుటుంబాన్ని వారి స్థితిగతులను తెలుసుకొనే విధంగా దళిత కుటుంబ గణన చేయాలన్నారు. చేపట్టిన పనిని ఇష్టంతో సమర్ధవంతంగా ని ర్వహించగలిగే పరిస్థితి లబ్దిదారునికి ఉందా? లేదా? అనే విషయాన్ని తెలు సుకోవాలన్నారు. వారికి తెలువకపోతే అర్ధం చేయించాలని సిఎం తెలిపారు. లబ్ధిదారులకు దళిత బంధు పథకం ఆర్థిక సహాయం అందే విధంగా ప్రత్యేకంగా దళిత బంధు బ్యాంకు ఖాతాను తెరిపించాలన్నారు. అందుకు బ్యాంకర్ల సహకారం తీసుకోవాలని సిఎం అధికారులకు సూచించారు. దళిత బంధు అకౌంట్‌ను ట్యాగ్ చేసుకొని ఆన్‌లైన్‌లో లబ్ధిదారు కుటుంబం చేపట్టిన పని పురోగతిని నిరంతర పర్యవేక్షణ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తగు సలహాలు, సూచనలు అందిస్తుండాలని సిఎం తెలిపారు.

దళిత కుటుంబాల వద్దకు వెళ్ళినప్పుడు అధికార భాషలో కాకుండా జనం భాషలోనే అర్ధమయ్యే రీతిలో మాట్లాడాలని సూచించారు. ఓపినియన్ మేక ర్స్‌గా, ఫెసిలిటేటర్లుగా ఒక సామాన్య కార్యకర్తలాగా ప్రజలతో వ్యవహరిం చాలన్నారు. వారితో ఇంటిమసి పెంచుకొవాలని సూచించారు. ఉద్యమ స్ఫూ ర్తితో పని చేయాలన్నారు. దళిత మేధావులు, విద్యార్థులు అధికారులకు సహ కరిస్తారని, అండగా నిలబడుతారని తెలిపారు. ఇందుకు సంబంధించి త్వర లో హైదరాబాద్‌లో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసుకుందామన్నా రు. దళిత బంధు రాబోయే కాలంలో మహా ఉద్యమంగా మారబోతుందన్నా రు. హుజురాబాద్ నియోజకవర్గం యావత్ తెలంగాణకు ట్రైనింగ్ గ్రౌండ్ కాబోతున్నందని సిఎం అన్నారు. ఎస్‌సి, బిసి వెల్ఫేర్ మంత్రులిద్దరు కరీంన గర్ జిల్లా వారే కావడం, ఫైనాన్స్ మినిస్టర్ పక్క నియోజకవర్గమే కావడం హుజురాబాద్ పైలెట్ ప్రాజెక్టు విజయవంతానికి మార్గం మరింత సుగమం అయిందని సిఎం తెలిపారు.

పాల ఉత్పత్తి రంగంలో కరీంనగర్ డెయిరీ సక్సె స్ స్టోరీ చూసి తనకెంతో గర్వంగా ఉందని సిఎం సంతోషం వ్యక్తం చేశారు. పాల ఉత్పత్తికి కరీంనగర్ జిల్లాలో అనుకూల వాతావరణం ఉందన్నారు. అ లాగే దళిత బంధు పథకంలో భాగంగా ఔత్సాహికుల కోసం డెయిరీ ఫామ్ ఏ ర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకు సంబంధించి కరీంనగర్ డెయిరీ యజమానులతో మాట్లాడి పాల సేకరణ విషయంలో సహకారం తీసుకో వాలన్నారు. ఏర్పాటు చేసిన దోహదపడా లని అధికారులకు సిఎం తెలిపారు. అవసరమైతే లక్ష లీటర్ల వరకు పాలను అదనంగా కొనుగోలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు సమావేశంలో పాల్గొన్న కరీంనగర్ డెయిరీ యజమాని ప్రకటించారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న దళిత సంఘాల నేతలు, మేధావులు, సీనియర్ రాజకీయ నాయకులతో సిఎం చర్చించారు. వారిచ్చిన సూచనలను నోట్ చేసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News