Friday, March 29, 2024

కరోనా చర్యలపై సిఎం కెసిఆర్ స్వీయ పర్యవేక్షణ

- Advertisement -
- Advertisement -

CM KCR

 

హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం కరీనంగర్ పట్టణంలో పర్యటించనున్నారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్ వచ్చిన కొద్దిమందికి కరోనా వైరస్ సోకినట్లు తేలడంతో అధికార యంత్రాంగం పట్టణంలో వైరస్ వ్యాప్తి నిరోధానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నది. ముఖ్యమంత్రి కూడా అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పలు సూచనలు చేస్తూ వచ్చారు. ఇండోనేషియా నుంచి వచ్చిన వారికి తప్ప, స్థానికులెవరికీ వ్యాధి సోకకుండా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు కూడా మంచి ఫలితాలు ఇచ్చాయి. అయినప్పటికీ కరీంనగర్‌లో పరిస్థితిని స్వయంగా పరిశీలించి, పర్యవేక్షించేందుకు శుక్రవారమే ముఖ్యమంత్రి కెసిఆర్ కరీంనగర్‌లో పర్యటించాలని భావించారు. కానీ ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ఉండడంతో ఈ పర్యటన శనివారానికి వాయిదా పడింది. సిఎంతో పాటు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు కూడా కరీంనగర్ లో పర్యటిస్తారు. అక్కడే ముఖ్యమంత్రి కెసిఆర్ మరోసారి సమీక్షా సమావేశం కూడా నిర్వహిస్తారు.

CM KCR self monitoring on Corona actions
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News