Saturday, April 20, 2024

రేపు మహబూబ్ నగర్ కు సిఎం కెసిఆర్..

- Advertisement -
- Advertisement -

CM KCR to Condolence to Srinivas Goud on Sunday

హైద‌రాబాద్: రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పరామర్శించనున్నారు. ఇటీవల మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ(78) గుండెపోటుతో కన్నుమూసిన విష‌యం తెలిసిందే. దీంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ మరణం పట్ల సంతాపం తెలిపనున్నారు. ఆమె చిత్రపటానికి నివాళులర్పించి,  మంత్రిని పరామర్శించేందుకు సిఎం కెసిఆర్ రేపు(ఆదివారం) మహబూబ్ నగర్ కు వెళ్లనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, హరీశ్ రావులతోపాటు పలువురు మంత్రులు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కలిసి ప‌రామ‌ర్శించారు.

CM KCR to Condolence to Srinivas Goud on Sunday

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News