Saturday, April 20, 2024

ఢిల్లీలో కొనసాగుతున్న సిఎం కెసిఆర్ పర్యటన

- Advertisement -
- Advertisement -

CM KCR Meet with Union Jal Shakti Minister

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటన కొనసాగుతుంది. ఆదివారం ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో కేంద్ర హోంశాఖ మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించే నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో సిఎం కెసిఆర్ పాల్గొననున్నారు. అనంతరం కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తో సిఎం కెసిఆర్ భేటి కానున్నారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడిన అనంతరం సాయంత్రం సిఎం కెసిఆర్ ఢిల్లీ వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాలు, నదీ యాజమాన్యబోర్డుల పరిధి నోటిఫికేషన్ సంబంధిత అంశాలపై కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కెసిఆర్ సమావేశమై చర్చించారు.

CM KCR to meet Minister Piyush Goyal in Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News