- Advertisement -
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్రస్థాయి అత్యున్నత, అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ పై పరిస్థితిని సమీక్షించనున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలపై, లాక్ డౌన్ నేపథ్యంలో ఉత్పన్నమైన పరిస్థితిపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో సిఎస్, డిజిపి, వైద్య ఆరోగ్య, పోలీస్, రెవెన్యూ, పౌర సరఫరాలు, వ్యవసాయ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సిఎం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పిలు, పోలీస్ కమిషనర్లతో సిఎం కెసిఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం జరిగే మీడియా సమావేశంలో సిఎం కెసిఆర్ మాట్లాడనున్నారు.
CM KCR to Review on Lockdown at Pragathi Bhavan
- Advertisement -