Thursday, April 25, 2024

రేపు తమిళనాడుకు సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -
CM KCR to visit Tamil Nadu tomorrow
రంగనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సోమవారం తమిళనాడులోని శ్రీరంగంలో రంగనాథస్వామి ఆలయాన్ని దర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుంచి బేగంపేట్ విమానశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తన కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 12.30 తిరుచిరపల్ల్లి విమానశ్రయంలో దిగి అనంతరం పది నిమిషాల్లో ఎస్‌ఆర్‌ఎం హోటల్‌కు చేరుకుంటారు. ఆ హోటల్ నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు బయలు దేరి రంగనాథ స్వామి ఆలయానికి చేరుకుంటారు. దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మూడు గంటల పది నిమిషాలకు తిరిగి ఎస్‌ఆర్‌ఎం హోటల్‌కు చేరుకుంటారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం సాయంత్రం 4.40 గంటలకు తిరుచిరపల్లి అంతర్జాతీయ విమానశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో చైన్నై అంతర్జాతీయ విమానశ్రయానికి చేరుకుంటారు. రాత్రి చెన్నైలోని హోటల్ ఐటిసిలో బస చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News