వరంగల్: వరంగల్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంజిఎం ఆసుపత్రిని శుక్రవారం సందర్శించారు. నేరుగా కోవిడ్ పేషంట్లు ఉన్న ఐసియు వార్డులోకి వెళ్లి రోగులను పరామర్శించారు. కోవిడ్ పేషంట్లకు అందుతున్న చికిత్స గురించి తెలుసుకున్నారు. కరోనాకు భయపడవద్దంటూ వారికి ధైర్యం చెప్పారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో దైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎంజిఎం ఆసుపత్రిలో అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఎంజిఎం ఆసుపత్రిలో ఉన్న వైద్య సౌకర్యాలు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సిబ్బందికి ఎదురవుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఎంత ఖర్చయినా సరే రోగులకు కావాలసిన అన్ని సౌకర్యాలను సమకూర్చాలని అక్కడే ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. కరోనా వేళ అయినవాళ్లే దూరం అవుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్ మొన్న గాంధీ, ఇవాళ వరంగల్ ఎంజిఎంలో కోవిడ్ రోగులను పరామర్శించి దైర్యం చెప్పారు.
CM KCR To Visit Warangal MGM Hospital