- Advertisement -
యాదాద్రిభువనగిరి: ముఖ్యమంత్రి కెసిఆర్ యాదాద్రికి చేరుకున్నారు. యాదాద్రికి రోడ్డు మార్గం ద్వారా కొండపైకి చేరుకున్న కెసిఆర్ కు అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. లక్ష్మీనరసింహా స్వామికి సిఎం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు సిఎంకు చతుర్వేద ఆశీర్వచనం అందజేశారు. ప్రస్తుతం సిఎం ఆయల పునర్నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు. ఆలయ స్తపతలకు సూచనలు చేశారు సిఎం. అనంతరం పనుల పురోగతిపై ఆలయ అధికారులతో కెసిఆర్ సమీక్షించనున్నారు. పనుల తీరుపై అధికారులకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. సిఎం కెసిఆర్ వెంట మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎంపి సంతోష్ కుమార్, ఎలిమినేటి కృష్ణా రెడ్డి తదితరులు ఉన్నారు.
CM KCR to Visit Yadadri temple
- Advertisement -