Thursday, April 25, 2024

రేపు యాదాద్రికి సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR visit to Yadadri temple tomorrow

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం ఉదయం 11 గంటలకు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు. ముగింపు దశలో ఉన్న పునర్నిర్మాణ పనుల పరిశీలిస్తారు. ఆలయ పున:సంప్రోక్షణ కోసం నిర్వహించనున్న సుదర్శన యాగం, ఇతర ఏర్పాట్లపై అధికారులతో చర్చించనున్నారు. మార్చి 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు వారం రోజుల పాటు అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పున: ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులు, పీఠాధిపతులు యోగులు, స్వామీజీలు, కోట్లాదిగా తరలివచ్చే జనం కోసం కల్పించే సౌకర్యాలపై సిఎం చర్చించనున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News