
వరంగల్ అర్బన్: వరంగల్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించారు. జైలులోని ఖైదీలను పరామర్శించి వారి నేర కారణాలను విచారించారు. జైలులో వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఖైదీలు తయారు చేసిన పలు రకాల చేనేత ఉత్పత్తులు, ఇతర వస్తువులను సీఎం పరిశీలించారు. అంతకు ముందు వరంగల్ ఎంజిఎం దవాఖానను సందర్శించిన సిఎం కెసిఆర్ అక్కడి కరోనా రోగులను పరామర్శించారు. వారి ఆరోగ్య వివరాలను, అందుతున్న సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఎవరూ అధైర్యపడొద్దని సిఎం భరోసా కల్పించారు.
CM KCR visit Warangal Central Jail
- Advertisement -