Thursday, April 25, 2024

వినాయకుని దీవెనలతో అడ్డంకులను అధిగమిస్తాం

- Advertisement -
- Advertisement -

సిఎం వినాయకచవితి శుభాకాంక్షలు

మనతెలంగాణ/హైదరాబాద్ : వినాయక చవితి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, భక్తి శ్రద్ధలతో హిందువులు గణనాథున్ని ఆరాధిస్తారని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. జ్ఞానం, లక్ష్య సాధన, నైతిక విలువలు, ప్రకృతి పరిరక్షణ వంటి సుగుణాలను వినాయక చవితి పండుగ మనకు నేర్పుతుందని సిఎం తెలిపారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లి విరిసే లా ఆనందంతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఎవరెన్ని ఆ టంకాలు సృష్టించినా వాటిని వినాయకుని దీవెనలతో అధిగమిస్తూ, సకల జన సంక్షేమమే లక్ష్యంగా, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సం క్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని సిఎం పేర్కొన్నారు. తలపెట్టిన కా ర్యాలు నిర్విఘ్నంగా కొనసాగేలా, సుఖ శాంతులతో జీవించేలా, దేశ ప్రజలకు ఆ ఏకదంతుని దీవెనలు అందాలని కెసిఆర్ ప్రార్థించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News