- Advertisement -
మహబూబాబాద్: రైతుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహబూబాబాద్లోని గాంధీపార్క్లో మామిడి పండ్ల విక్రయ కేంద్రాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మామిడపండ్ల ఉత్పత్తిలో మహబూబాబాద్ జిల్లాకు చాలా ప్రాముఖ్యత ఉందని, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, 25 వేల ఎకరాల్లో పామాయిల్ సాగుకు కొంత మంది రైతులు ముందుకొచ్చారని, రైతులు పంటల మార్పిడి చేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో మహబూబాబాద్ జిల్లాను మామిడి ఉత్పత్తిలో అగ్రగామిగా నిలపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఎ శంకర్ నాయక్, అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -