Thursday, April 25, 2024

అడవులకు నష్టం కలగకుండా ఫలాన్ని సేకరించాలి….

- Advertisement -
- Advertisement -

గిరిజనులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించిన ఫారెస్ట్ కాలేజీ, గిరిజన కార్పొరేషన్

సిద్దిపేట: అడవులకు నష్టం జరగకుండా శాస్త్రీయ పద్దతులతో ఫలసాయం పొందటంపై గిరిజనులకు అటవీ కళాశాల, పరిశోధన సంస్థ రెండు రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించింది. వన్ ధన్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర గిరిజన సహకార సంస్థతో కలిసి అటవీ కళాశాల ఈ రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా ములుగు ఫారెస్ట్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించారు.

చిన్న తరహా అటవీ ఫలసాయాల సేకరణలో శాస్త్రీయ సాంకేతిక పద్ధతులను అవలంబిస్తూ అడవికి, చెట్లకు హాని కల్గించకుండా, మంచి నాణ్యత గల ఫలసాయాలను సేకరించటం, అధిక ఆదాయం పొందడంపై గిరిజనులకు ఈ శిక్షణలో అవగాహన కల్పించారు. అడవుల నుంచి వివిధ రకాల ఉత్పత్తులను సేకరించటంలో భాగంగా నిప్పుపెట్టడం, చెట్లు కొట్టేయటం, వన్యప్రాణులకు హానిచేయటం లాంటి కార్యక్రమాలు ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదని తెలిపారు.

ఈ శిక్షణ కార్యకమంలో భద్రాచలం, ఉట్నూర్, ఏటూర్ నాగారం, మన్ననూర్ ఐటిడిఎలలో గల 17 వన్ ధన్ వికాస కేంద్రాలకు  చెందిన 50 మంది గిరిజనులు, జిసిసి తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ ఫీల్డ్ అధికారులు హాజరయ్యారు. వీరందరూ కూడా జులై 19 నుంచి క్షేత్రస్థాయి శిక్షణ కార్యక్రమంలో తమ ప్రాంతాల్లో ఉన్న వన్ ధన్ వికాస కేంద్రాల (విడివికె) పరిధిలో మిగతా గిరిజన సభ్యులందరికీ శిక్షణ ఇస్తారు.

అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్ సిఆర్ఐ) డీన్ ప్రియాంక వర్గీస్ కార్యక్రమాన్ని సమన్యయ పరిచారు. ఈ కార్యక్రమంలో అటవీ కళాశాల, పరిశోధన సంస్థ అధికారులతో పాటు రాష్ట్ర గిరిజన సహకార సంస్థ (టిఎస్జీసిసి), గిరిజన మార్కెటింగ్ అభివృద్ధి సంస్థ (టిఆర్ఐఎఫ్ఇడి) అధికారులు పాల్గొన్నారు. వన్ ధన్ ప్రాజెక్ట్ లో భాగంగా గిరిజనులకు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News