- Advertisement -
భోపాల్: మధ్యప్రదేశ్ కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య 20కి చేరింది. బుధవారం మరో ఆరుగురు మరణించినట్టు అధికారులు తెలిపారు. నిర్లక్ష్యం వహించినందుకు మొరీనా జిల్లా కలెక్టర్, ఎస్పీలను విధుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. బుధవారం ఈ ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్సింగ్చౌహాన్ సమీక్ష జరిపారు. మొరీనా జిల్లాలోని గ్రామాల్లో కల్తీ మద్యాన్ని తాగిన ఘటనలో పలువురు అస్వస్థతకు గురయ్యారు. 21మందికి మొరీనా, గ్వాలియర్లోని ఆస్పత్రుల్లో ఇంకా చికిత్స అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. మద్యం శాంపిళ్లను సాగర్లోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు కారణంగా భావిస్తున్న ఏడుగురిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
Collector and SP Suspended after hooch Tragedy in MP
- Advertisement -