Thursday, March 28, 2024

వ్యాక్సినేషన్‌పై కలెక్టర్ శివలింగయ్య ఆకస్మిక తనిఖీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణా/జఫర్‌గడ్ : కొవిడ్19 నియంత్రణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో మండలంలోని తీగారం, తిమ్మంపేట్‌లో ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జనగామ జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారుల పనితీరును ప్రశంసించిన కలెక్టర్ పలు సూచనలు చేశారు. మండలంలో వందశాతం వ్యాక్సిన్ పూర్తయ్యేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ తీసుకోనివారికి అవగాహన కల్పించి వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు. స్థానికంగా ఉండని వారిని ఫోన్‌లో సంప్రదించి వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఏది ఏమైనా ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఒ రాంరెడ్డి, మండల ప్రత్యేకాధికారి రాజేంద్రప్రసాద్, మండల అభివృద్ధి అధికారి శ్రీధర్‌స్వామి, ఎంపిఒ పాక శ్రీనివాస్, మండల వైద్యాధికారి డా రాజు, సర్పంచ్‌లు గోనె జైపాల్ రెడ్డి, మంద మల్లయ్య, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News