- Advertisement -
న్యూఢిల్లీ: నియోవైజ్గా అందరూ పిలుస్తున్న తోకచుక్క సి/2020 ఎఫ్ 3 తన వెలుగులతో వీక్షకులను సమ్మోహపరుస్తూనే ఉంది. దీన్ని దర్శించాలని నిరీక్షించే భారతీయులకు శుభవార్త. ఈ నెల 14 నుంచి ఆకాసంలో వాయువ్య భాగంలో ఇరవై రోజుల పాటు స్పష్టంగా కనిపిస్తుంది. ఎలాంటి సహాయం లేకుండా నేరుగా చూడవచ్చని ఒడిశా రాజధాని భువనేశ్వర్ లోని పథాని సమంత ప్లానెటోరియం డిప్యూటీ డైరక్టర్ డాక్టర్ సుభేందు పట్నాయక్ వెల్లడించారు. సూర్యాస్తమయం అయిన తరువాత దాదాపు ఇరవై నిమిషాల సేపు కనిపిస్తుందని చెప్పారు.
Comet neowise will be visible from July 14 in India
- Advertisement -