Thursday, April 18, 2024

బిఆర్ఎస్ లోకి వెళ్ళిన ఎమ్మెల్యేల పై ఫిర్యాదు..

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీకి మారిన12 మంది ఎమ్మెల్యే లపై మొయినాబాద్ పోలీసు స్టేషన్ లో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీ లో టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ కాంగ్రెస్ నాయకులతో భేటి కానున్నారు. కాంగ్రెస్ ముఖ్య నాయకుల సిఎల్పీ నుంచి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయనున్నారు.

12 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరినందుకు వారికి వచ్చిన రాజకీయ, ఆర్థిక లాభాల గురించి సవివరంగా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ లోని నలుగురు ఎమ్మెల్యే ల కేసు సిట్, సీబీఐ, హైకోర్టులలో వాదనలు జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ ఈ విషయంలో ఫిర్యాదు చేస్తుండడంతో సంచలనంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News