Friday, March 29, 2024

రూ.2 పంచాయతీ…. బస్సు నుంచి ప్రయాణికురాలిని గెంటేసిన కండక్టర్

- Advertisement -
- Advertisement -

 

కోల్‌కతా: రెండు రూపాయల కోసం ప్రయాణికురాలిని ప్రైవేటు బస్సు నుంచి కండక్టర్ గెంటేసిన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 44 రూట్‌లో బబౌటి నుంచి హౌరాకు ఏడు రూపాయలకు బదులుగా కండక్టర్ సజాల్ హల్డర్(36) తొమ్మిది రూపాయల టిక్కెట్ జారీ చేయడంతో ప్రయాణికురాలు, కండక్టర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బిసి రాయ్ చిల్డ్రన్ ఆస్పత్రి బస్టాఫ్ రాగానే ప్రయాణికురాలిని బస్సు నుంచి కండక్టర్ నెట్టేశాడు. దీంతో ప్రయణికుడు బలియగఢ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఇతర ప్రయాణికుల నుంచి విచారించి కండక్టర్‌పై ఐపిసి 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రైవేటు బస్సులలో సిసి టివి కెమెరాలు అమర్చుకోవాలని పోలీసులు సూచించారు. వీడియో ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు.

 

Conductor push woman off bus after fight over Rs 2
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News