Wednesday, April 24, 2024

అమిత్ షా రాజీనామా చేయాలి

- Advertisement -
- Advertisement -

Cong

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో చెలరేగుతున్న హింసాకాండకు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాలదే బాధ్యతని కాంగ్రెస్ నిందించింది. శాంతి భద్రతలను పరిరక్షించడంలో ఘోరంగా విఫలమైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండు చేసింది. ఢిల్లీలోని వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న హింసాత్మక సంఘటనలపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ బుధవారం సమావేశమైంది. శాంతి సామరస్యాల పరిరక్షణ కోసం ప్రజలకు అండగా నిలబడడంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ఆరోపించింది.

దేశ రాజధానిలో ఇంతటి ఘోర దుర్ఘటనకు రెండు ప్రభుత్వాల ఉమ్మడి వైఫల్యమే ప్రధాన కారణమని ఒక తీర్మానంలో సిడబ్లుసి ఆరోపించింది. ఈ హింసాకాండను అదుపుచేయడంలో హోం మంత్రి అమిత్ షా ఘోరంగా విఫలమయ్యారని, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండు చేసింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సిడబ్లుసి సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నాయకులు ఎకె ఆంటోని, గులాం నబీ ఆజాద్, ప్రియాంకా గాంధీ తదితరులు పాల్గొన్నారు. దేశంలో లేని కారణంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమావేశానికి రాలేకపోయినట్లు తెలుస్తోంది. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా, ఆ తర్వాత కొందరు బిజెపి నాయకులు ప్రజలను రెచ్చగొట్టేవిధంగా ఉపన్యాసాలు చేస్తున్నారని, ఈ కారణంగా కూడా హింసాకాండ చెలరేగిందని కాంగ్రెస్ ఆరోపించింది.

Cong demands Amit Shahs resignation, CWC alleges Home minister Amit Shah for Delhi violence,

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News