Friday, April 19, 2024

టిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ కౌన్సిలర్

- Advertisement -
- Advertisement -

పాలకుర్తి: మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మున్సిపాలిటీ లో కాంగ్రెస్ కు చెందిన 8వ వార్డు కౌన్సిలర్ నర్కుటి గజానంద్ టిఆర్ఎస్ పార్టీలో చేరారు. హన్మకొండలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గురువారం గులాబీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గజానంద్ మాట్లాడారు. తెలంగాణ సిఎం కెసిఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, రైతుల కోసం చేస్తున్న పనులకు ఆకర్షితులు కావడంతో మంత్రి నేతృత్వంలో టిఆర్ఎస్ లో చేరుతున్నమన్నారు. గజానంద్ కి తగిన గుర్తింపు లభిస్తుందని మంత్రి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News