Wednesday, April 24, 2024

మాజీ ఎంపి నంది ఎల్లయ్య కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Congress Ex MP Nandi Yellaiah dies with Corona

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపి నంది ఎల్లయ్య(85) కరోనాతో కన్నుమూశారు. శనివారం ఉదయం హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత నెల 29న కరోనా లక్షణాలతో ఆయన దవాఖానలో చేరారు. అప్పటినుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరుసార్లు లోక్ సభ, రెండు సార్లు రాజ్యసభ ఎంపిగా పనిచేశారు. ఆయన సిద్దిపేట నుంచి ఐదుసార్లు, నాగర్ కర్నూల్ నుంచి ఒకసారి ఎంపిగా గెలిచారు. గతంలో టిపిసిసి ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు నంది ఎల్లయ్య. 2014 మార్చి నుంచి ఎల్లయ్య ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించారు. నంది ఎల్లయ్య మృతిపట్ల కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్,కుంతియా, భట్లి, పొన్న, వీహెచ్, సంపత్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రానికి తీరని లోటని కాంగ్రెస్ నేతలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News