Thursday, March 28, 2024

కరోనాతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మృతి

- Advertisement -
- Advertisement -

congress leader eknath gaikwad passed away

ముంబై: మహారాష్ట్ర మాజీ ఎంపి, ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు ఏక్నాథ్ గైక్వాడ్ కోవిడ్ -19 కన్నుమూశారు. ఆయన వయసు 81ఏళ్లు. కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 10 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన కూతురు వర్షా గౌక్వాడ్‌ ప్రస్తుతం మహారాష్ట్ర ప్రస్తుత విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఏక్నాథ్ గైక్వాడ్ ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ముంబై సౌత్‌ సెంట్రల్‌ నియోజకర్గం నుంచి ఏక్‌నాథ్‌ గైక్వాడ్‌ రెండుసార్లు ఎంపిగా పనిచేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆసియాలో అతిపెద్ద మురికివాడ ధారావి నియోజకవర్గం ఎంఎల్ఎగా 1985 నుంచి వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఇప్పటికే దేశంలో కరోనాతో రాజకీయ ప్రముఖులు బలవుతున్నారు. ఆయన మృతిపట్ల పలు పార్టీల రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.

congress leader eknath gaikwad passed away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News