- Advertisement -
బెంగళూరు: మాజీ మేయర్, కర్నాటక కాంగ్రెస్ నాయకుడు సంపత్ రాజ్ అదృశ్యమయ్యారు. శుక్రవారం రాత్రి నుండి కనిపించడంలేదని పోలీసులు చెబుతున్నారు. అతనికి కోవిడ్-19 సోకడంతో చికిత్స కోసం నగరంలోని ఎసిపి ఆస్పత్రిలో చేరారు. ఇటీవల బెంగళూరు నగరంలో జరిగిన మాబ్ హింసకు సంబంధించిన కేసులో సంపత్ రాజ్ నిందితుడు. ఈ కేసుకు ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (ఐఓఓ)అయిన జాయింట్ కమిషనర్, సిటీ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) సందీప్ పాటిల్, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ (ఎసిపి) వేణుగోపాల్ అక్టోబర్ 7న ఆసుపత్రికి రాజ్ డిశ్చార్జ్ గురించి సమాచారం ఇవ్వడానికి లిఖితపూర్వక నోటీసు ఇచ్చారు. పోలీసులకు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా డిశ్చార్జ్ చేసినందుకు, శనివారం ఎసిపి ఆసుపత్రిని సందర్శించిన అధికారులు నోటీసులు ఇచ్చారు.
- Advertisement -