- Advertisement -
హైదరాబాద్: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంత పరిశీలనకు వెళ్తున్న టి.కాంగ్రెస్ నేతలు రేవంత్రెడ్డి, మల్లు రవిని ఉప్పునుంతల మండలం వెల్టూరు గేట్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించే స్వేచ్ఛ కూడా తమకు లేదా అని రేవంత్ రెడ్డి పోలీసులను ప్రశ్నించారు. అగ్నిప్రమాద ఘటనపై సిఐడి దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలోనే తాము కాంగ్రెస్ నేతల పర్యటనకు అనుమతి ఇవ్వలేదని పోలీసులు వెల్లడించారు.
Congress MP Revanth Reddy Arrested At Srisailam
- Advertisement -