అమరావతి: కట్టుకున్న భార్యను అనుమానంతో హత్య చేసి అనంతరం ఉరేసి ఆత్మహత్య చేసుకుందని నమ్మించడానికి భర్త ప్రయత్నించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైజాగ్లోని పాయకరావు పేటలో జరిగింది. అమ్మను తండ్రి చంపాడని పిల్లలు తెలపడంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అంకంపేట గ్రామానికి చెందిన సింహాద్రి 2008లో పెద్దిపాలేనికి చెందని భవానిని పెళ్లి చేసుకున్నాడు. 2017లో భవాని కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. ట్రైనింగ్ తీసుకున్న అనంతరం ఆమె పోస్టింగ్ నక్కపల్లిలో వచ్చింది. రోజూ వీధులకు వెళ్లి వచ్చేది. ఈ దంపతులకు నాగశాంతి(11), హేమంత్(09) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
భవానికి వివాహేతర సంబంధం ఉందని అనుమానించి పలుమార్లు అతడు వేధించేవాడు. అతడి వేధింపుల ఎక్కువ కావడంతో రోజు ఇంట్లో దంపతుల మధ్య గొడవలు జరిగేవి. శుక్రవారం రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన భవానితో భర్త సింహాద్రి గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరు మధ్య మాటామాటా పెరగడంతో తాడును ఆమె మెడకు చుట్టి ప్రాణం తీశాడు. శ్లాబుకు ఉన్న హుక్కుకు తాడును కట్టాడు. తల్లి ఆత్మహత్య చేసుకుందని అందరికి చెప్పాలని పిల్లలను సింహాద్రి బెదిరించాడు.
రాత్రి 1.30 సమయంలో హెడ్ కానిస్టేబుల్ వద్దకు వెళ్లి తన భార్య ఆత్మహత్య చేసుకుందని తెలిపాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని కిందకు దించారు. భవాని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు ఇంటికి వచ్చారు. అమ్మ ఆత్మహత్య చేసుకోలేదని డాడీ చంపేసి ఉరేశాడని అమ్మమ్మకు మనవరాలు, మనవడు తెలిపారు. వెంటనే భవాని తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో అలుడిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి అల్లుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని సిఐ విజయ్కుమార్ తెలిపారు.