Friday, March 29, 2024

తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Constable Commits Suicide in Hyderabad

హైదరాబాద్: తుపాకీతో కాల్చుకుని ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రాణిగంజ్‌లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ సంఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కార్యాలయంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం….. నల్గొండ జిల్లా బత్తులపాలెం, నేరుడు చెర్లకు చెందిన మధు ఎపిఎఫ్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతడికి భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు. విధి నిర్వహిణలో ఉన్న మధు తన వద్ద ఉన్న ఎస్‌ఎల్‌ఆర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గన్‌మిస్ ఫైర్ అవడం వల్లే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉదయం మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వస్తుండగా గన్ మిస్ ఫైర్ అయినట్లు పోలీసులు భావిస్తున్నారు. కానిస్టేబుల్‌కు ఎలాంటి ఇబ్బందులు లేవని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మహంకాళి పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Constable Commits Suicide in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News