- Advertisement -
యాచారం: రంగారెడ్డి జిల్లాలోని యాచారం శివారులో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. వెంచర్ లో చెట్టుకు ఉరేసుకుని కానిస్టేబుల్ సైదులు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు నల్గొండ జిల్లా మర్రిగూడలో విధులు నిర్వహిస్తున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కానిస్టేబుల్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Constable commits suicide in Ranga Reddy district
- Advertisement -