Tuesday, April 23, 2024

పిఎస్ లో కానిస్టేబుళ్ల బట్టలు విప్పించి….

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ విజయనగరం న్యూస్: కానిస్టేబుళ్లు తప్పుడు పనులు చేయడంతో వారిని ఓ ఎస్‌పి దుస్తులు విప్పించి స్టేషన్‌లో అర్థనగ్నంగా కూర్చొబెట్టిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… విజయనగరం కాలనీలో కొందరు పేకాట ఆడుతున్నారని సమాచారం ఇవ్వడంతో నలుగురు కానిస్టేబుల్ మహేశ్, అభిషేక్, మంజునాథ్, శ్రీకాంత్ పేకాట శిబిరంపై దాడి చేశారు. పేకాట రాయుళ్ల నుంచి రూ.20 వేల నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఆ నలుగురు కానిస్టేబుళ్లు కేసు నమోదు చేయకుండా నగదు, సెల్‌ఫోన్‌ను తమ జేబుల్లో వేసుకున్నారు. మరుసటి రోజు పేకాటరాయుడు వెంకటేష్ తనకు సెల్‌ఫోన్ ఇవ్వాలని పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐని అడిగాడు. ఎలాంటి కేసు నమోదు కాలేదని ఎస్‌ఐ తెలపడంతో సమాచారం ఎస్‌పికి చేరింది. ఎస్‌పి పోలీస్ స్టేషన్‌కు చేరుకొని కానిస్టేబుళ్ల బట్టలను విడిపించి రెండు గంటల పాటు స్టేషన్‌లో కూర్చొ బెట్టాడు. వారిని సస్పెండ్ చేయడంతో పాటు రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News