- Advertisement -
షాబాద్: రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ సమీపంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. షాబాద్ హరిజనవాడ వద్ద సడెన్ బ్రేక్ వేయడంతో లారీ పల్టీలు కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా బోల్తాపడటంతో అదుపుతప్పిన లారీని బైక్ ఢీకొట్టంది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న కానిస్టేబుల్ శ్రీశైలం ఛాతిలో బలమైన గాయం అయింది. తీవ్రంగా గాయపడిన ఆయనను చేవెళ్ల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. శ్రీశైలం షాబాద్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
Constable Killed in Road Accident At Shahabad
- Advertisement -