- Advertisement -
సంగారెడ్డి: విధులు నిర్వహిస్తూ కానిస్టేబుల్ గుండె పోటుతో ప్రాణాలు విడిచిన విషాదకర సంఘటన సంగారెడ్డి పట్టణం సాయినగర్ కాలనీలో మంగళవారం జరిగింది. కానిస్టేబుల్ చంద్రయ్య (40) సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులున్నారు. చంద్రయ్య మృతి చెందిన వార్త విన్న కుటుంబీకులు, బంధవులు కన్నీరుమున్నీ రవుతున్నారు. చంద్రయ్య స్వస్థలం జిల్లాలోని ఆందోలు మండలం కాంసంపల్లి. ప్రస్తుతం కానిస్టేబుల్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా సర్కార్ దావాఖానకి తరలించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు.
Constable on duty died of heart attack in sangareddy
- Advertisement -