Tuesday, April 23, 2024

పెళ్లికి ముందు ప్రియుడితో లేచిపోయిన కానిస్టేబుల్ కూతురు… దంపతుల ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: పెళ్లికి ముందు కూతురు మరో వ్యక్తితో లేచిపోవడంతో కానిస్టేబుల్, ఆయన భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. 1995 బ్యాచ్‌కు చెందిన నారాయణ జిన్నారం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ లో నారాయణ జన్మించారు. కానిస్టేబుల్ కు భార్య రాజేశ్వరి(45), ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు నిహారికకు పెళ్లి నిశ్చయం కావడంతో పెళ్లి పనులు చేసుకుంటున్నారు. నిహారికకు వివాహం ఇష్టం లేకపోవడంతో పెళ్లికి రెండు రోజుల ముందు మరో వ్యక్తితో లేచిపోయింది. పెళ్లి నిశ్చయమైన తరువాత కూతురు లేచిపోవడంతో బంధువుల్లో పరువు పోతుందని భావించిన తీవ్ర మనోవేదనకు గురయ్యారు. వెంటనే దంపతులు ఇంట్లో ఉరేసుకున్నారు. ఎస్‌పి సృజన, డిఎస్‌పి బాలాజీ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News