Saturday, April 20, 2024

రాయితీపై కేంద్రం మొండిచేయి!

- Advertisement -
- Advertisement -

Consumer concerns over Gas subsidy

 

మే నెలలో జమకానీ డబ్బు
రానున్న రోజుల్లో రాయితీ ఉంటుందా ? లేదా ?
ఆందోళనలో వంటగ్యాస్ వినియోగదారులు
స్పష్టతనివ్వని చమురు సంస్థలు

మనతెలంగాణ/హైదరాబాద్ : వంటగ్యాస్ బుక్ చేసుకున్న (మే నెలకు గాను) వినియోగదారుల ఖాతాల్లో రాయితీ సొమ్మును జమ చేయకుండా కేంద్రం మొండి చేయి చూపిందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిలిండర్ ధర గణనీయంగా తగ్గడంతో ప్రభుత్వం రాయితీ ఇవ్వలేదని చమురు సంస్థలు పేర్కొంటుండగా, మళ్లీ వంటగ్యాస్‌పై రాయితీ ఇస్తారా? ఇంతటితో ముగిసినట్టేనా అన్న చర్చ కూడా ప్రస్తుతం కొనసాగుతోంది. లాక్‌డౌన్ సమయంలో అంతా ఇళ్లకే పరిమితం కావడంతో అనూహ్యంగా పెట్రో ఉత్పత్తుల వాడకం తగ్గిపోయింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు అమాంతం పడిపోయాయి.

అంత ర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల ఆధారంగా పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలను చమురు సంస్థలు నిర్ణయిస్తాయి. పెట్రో ధరలను రోజువారీ పద్ధతిలో సమీక్షిస్తుండగా, వంటగ్యాస్ సిలిండర్ల ధరలను మాత్రం నెలకొకసారి సమీక్షించి ప్రతి నెల 1వ తేదీన నిర్ణయిస్తారు. ఇక, ఈ మధ్యే వంగట గ్యాస్ ధర భారీగా తగ్గిపోయింది. మే నెలలో 14.2 కిలోల సిలిండరు ధరను చమురు సంస్థలు రూ.589.50గా నిర్ణయించడంతో, ఏప్రిల్‌లో రూ.796.50గా ఉన్న గ్యాస్ ధర మే నెలలో ఏకంగా రూ.207లు తగ్గింది. ఇక వంట గ్యాస్ సిలిండరు పంపిణీపై వినియోగదారులకు రాయితీ అందిస్తున్న కేంద్రం, గ్యాస్ బుకింగ్, డెలివరీ తర్వాత నగదు బదిలీ రూపంలో వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తూ వస్తుంది. కానీ మే నెలలో రాయితీ సొమ్మును నిలిపివేయడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News