Saturday, April 20, 2024

మోసపూరిత ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -
Consumers should be vigilant on fraudulent advertising
టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి

హైదరాబాద్: మోసపూరిత ప్రకటనలపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ వాడకం బిల్లుల చెల్లింపు పేరుతో కొంతమంది వ్యక్తులు వినియోగదారులను మెసేజ్‌ల ద్వారా/ ఫోన్‌ల ద్వారా సంప్రదించి విద్యుత్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, అవి కట్టకుంటే రాత్రిపూట విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని వినియోగదారులను బెదిరిస్తున్నారన్నారు. దీంతోపాటు వారి బ్యాంకు అకౌంట్, డెబిట్ కార్డు వివరాలు తీసుకొని వారి అకౌంట్ల నుంచి నగదును విత్ డ్రా చేసుకుంటున్నారని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ దృష్టికి వచ్చిందని సిఎండి రఘుమారెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు విద్యుత్ వాడకం బిల్లుల వసూలు/ చెల్లింపుల కోసం సంస్థ సిబ్బంది వినియోగదారుల బ్యాంకు అకౌంట్/ డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డుల వివరాలు అడగరని ఆయన తెలిపారు. బిల్లు చెల్లించిన రసీదును మాత్రమే తమ సిబ్బంది అడుగుతారని ఆయన పేర్కొన్నారు.

వెబ్ సైట్ లింకులు మెసేజ్ ద్వారా పంపొద్దు

విద్యుత్ సంస్థ బిల్లుల చెల్లింపు కోసం ఎటువంటి వెబ్ సైట్ లింకులు మెసేజ్ ద్వారా పంపదని ఆయన సూచించారు. వినియోగదారులు చెల్లించాల్సిన బిల్లు, బకాయిల వివరాలు సంస్థ నెల నెలా జారీచేసే బిల్లులో క్లుప్తంగా పేర్కొనడం జరుగుతుందన్నారు. వినియోగదారులు తాము బిల్లు చెల్లించినా, ఒకవేళ ఎవరైనా వ్యక్తులు ఫోన్ చేసినా/ మెసేజ్ చేసినా విద్యుత్ బిల్లు పెండింగ్ లో ఉన్నాయని పేర్కొంటే తాము చెల్లించిన వివరాలను సంస్థ వెబ్ సైట్ www.tssouthernpower.com మరియు TSSPDCL మొబైల్ యాప్‌లో సరి చూసుకోవచ్చన్నారు. ఒక వేళ ఏమైనా తేడాలు ఉంటే సంస్థకు ఆన్‌లైన్ ద్వారా లేదా సంబంధిత సెక్షన్ ఆఫీసర్ (ఏఈ)ని సంప్రదించి సరిచేసుకోవాలని ఆయన సూచించారు. రాత్రిపూట/అర్ధరాత్రి పూట విద్యుత్ సరఫరా నిలిపివేయడం చేయదన్నారు. ఎవరైనా వ్యక్తులు విద్యుత్ బిల్లుల చెల్లింపుల పేరుతో తమ బ్యాంకు అకౌంట్ వివరాలు, మోసపూరిత లింకులు మెసేజ్ ల ద్వారా పంపినా వినియోగదారులు పోలీస్ శాఖకు ఫిర్యాదు చేయాలని సిఎండి రఘుమారెడ్డి పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News