Saturday, April 20, 2024

ఎస్‌యువీలు, వాణిజ్య వాహనాల కోసం కాంటినెంటల్‌ టైర్స్‌..

- Advertisement -
- Advertisement -

Continental launches new range of tyres for SUVs

న్యూఢిల్లీ: సుప్రసిద్ధ ప్రీమియం టైర్‌ తయారీదారు కాంటినెంటల్‌ టైర్స్‌, తమ మోడిపురం ప్లాంట్‌ వద్ద ప్యాసెంజర్‌, వాణిజ్య వాహన విభాగాల కోసం పలు నూతన ఆర్టికల్స్‌ను తయారుచేయడం ప్రారంభించింది. కంపెనీ యొక్క స్థానికీకరణ కార్యక్రమాలకు అనుగుణంగా ఇది ఉండటంతో పాటుగా భారత ప్రభుత్వ మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమానికి ఇది మద్దతునందిస్తుంది. కాంటినెంటల్‌ టైర్స్‌ ఇండియా ఇప్పుడు ప్రీమియం సెడాన్స్‌ మరియు ఎస్‌యువీల కోసం 19 అంగుళాలు మరియు 20 అంగుళాల రిమ్‌ సైజ్‌ ఆర్టికల్స్‌ను తయారుచేస్తుంది. అంతేకాదు, ఈ కంపెనీ ఇప్పుడు డిజిటల్‌ పరిష్కారాలను సైతం పరిచయం చేసింది. భారతదేశంలో వాణిజ్య వాహన విభాగం కోసం కాంటి360 ఫ్లీట్‌ సొల్యూషన్స్‌కు ఇది అదనపు విలువ జోడిస్తుంది.

భారతీయ ప్యాసెంజర్‌ వాహన విభాగం గత కొద్ది సంవత్సరాలుగా ఎస్‌యువీ టైర్ల కోసం డిమాండ్‌ను అందుకుంటుంది. వాణిజ్య వాహన విభాగంలో ఫ్లీట్‌ యజమానులు తమ వాహనాల పనితీరును ఒకే ఒక్క, క్రమబద్దీకరించిన ఛానెల్‌ ద్వారా పర్యవేక్షించడంలో తోడ్పడే పరిష్కారాలను కోరుకుంటున్నారు. తద్వారా అతి సులభంగా కార్యకలాపాలు నిర్వహించడంతో పాటుగా అత్యుత్తమ లాభదాయకతకూ తోడ్పడాలనుకుంటున్నారు. కాంటినెంటల్‌ యొక్క నూతన ఉత్పత్తులు మారుతున్న భారతీయ వినియోగదారుల టైర్ల అవసరాలను తీర్చనున్నాయి.

ఈ నూతన ఉత్పత్తులను విడుదల చేయడం గురించి కాంటినెంటల్‌ టైర్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మరియు సెంట్రల్‌ రీజియన్‌ బీఏ పీఎల్‌టీ ఆర్‌ఈ ఏపీఏసీ హెడ్‌ సమీర్‌ గుప్తా మాట్లాడుతూ ‘‘ మాకు ఇండియా అత్యంత కీలకమైన మార్కెట్‌. భారతదేశంలో మేము స్ధిరంగా పెట్టుబడులు పెట్టడంతో పాటుగా ‘ఇన్‌ ద మార్కెట్‌, ఫర్‌ ద మార్కెట్‌’ వ్యూహంతో మా పోర్ట్‌ఫోలియోను విస్తరించనున్నాము. ఎస్‌యువీలు మరియు ప్రీమియం వాహన విభాగాల కోసం అలా్ట్ర హై పెర్‌ఫార్మెన్స్‌ 19 అంగుళాలు మరియు 20 అంగుళాల రిమ్‌ సైజ్‌ టైర్లను స్ధానికంగా ఉత్పత్తి చేయాలనే తమ లక్ష్యానికి అనుగుణంగా మరియు వాణిజ్య వాహనాల కోసం డిజిటల్‌ పరిష్కారాలను అందించాలనే మా ప్రయత్నాలు భారతీయ మార్కెట్‌ పట్ల మా నిబద్ధతను పునరుద్ఘాటించడంతో పాటుగా వైవిధ్యమైన భారతీయ రోడ్డు వాతావరణానికి తగినట్లుగా నాణ్యమైన టైర్లను అందిస్తుంది. నూతనంగా, స్థానికంగా తయారుచేసే ఆర్టికల్స్‌ మాకు పోటీ ప్రయోజనం అందించడంతో పాటుగా మారతున్న మరియు అభివృద్ధి చెందుతున్న భారతదేశపు టైర్ల అవసరాలను సైతం తీర్చగలవనే నమ్మకంతో ఉన్నాము’’ అని అన్నారు.

ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం గురించి కుల్దీప్‌ సింగ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ మాన్యుఫాక్చరింగ్‌ కాంటినెంటల్‌ టైర్స్‌, ప్లాంట్‌ మోడీపురం, మాట్లాడుతూ.. ‘‘మోడీపురం వద్ద మా బృందాలు ఆర్‌ అండ్‌ డీ బృందంతో కలిసి పనిచేయడంతో పాటుగా భారతీయ మార్కెట్‌ అవసరాలను తీర్చేందుకు వినూత్నమైన మరియు నూతన పరిష్కారాలను సృష్టించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయి. ఈ ఫలితాల పట్ల మేము సానుకూలంగా ఉన్నాము. ఈ కార్యక్రమం ద్వారా మోడీపురం ప్లాంట్‌ వద్ద స్థానికంగా నూతన మరియు వినూత్న ఉత్పత్తులను ఉత్పత్తి చేసే నైపుణ్యం మెరుగుపరిచింది’’అని అన్నారు.

ఎస్‌యువీలు, ప్రీమియం ప్యాసెంజర్‌ వాహనాల కోసం పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి మద్దతునందిస్తున్న కాంటినెంటల్‌

గత దశాబ్ద కాలంగా భారతీయ మార్కెట్‌లో ఎస్‌యువీలు మరియు ప్రీమియం ప్యాసెంజర్‌ వాహన విభాగంలో అత్యంత వేగంగా వృద్ధి కనిపిస్తుంది. అయితే, ఈ విభాగంలో టైర్లు ను ప్రధానంగా దిగుమతి చేసుకుంటున్నారు మరియు భారతదేశంలో వీటిని విస్తృతంగా తయారుచేయడం లేదు. కాంటినెంటల్‌ టైర్లు ఆర్‌ అండ్‌ డీ పై విస్తృతంగా పెట్టుబడులు పెట్టడంతో పాటుగా వృద్ధి చెందుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు స్ధానికంగా టైర్లను ప్రీమియం ఎస్‌యువీ విభాగంలో ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. స్ధానికీకరణ పరంగా 19 అంగుళాలు మరియు 20 అంగుళాల పరిమాణంలో అలా్ట్ర హై పెర్‌ఫార్మెన్స్‌ టైర్ల కోసం తయారీ లైన్స్‌ జోడించడం ఓ గొప్ప ముందడగు. ఇది తమ వినియోగదారులకు మరింత సమగ్రమైన శ్రేణి టైర్లను అందించడంతో పాటుగా భారత ప్రభుత్వ మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమానికి మద్దతు అందిస్తుంది.

కాంటినెంటల్‌ టైర్స్‌ వద్ద సౌకర్యం మరియు భద్రత అనేవి అభివృద్ధి చేసే ప్రతి ఉత్పత్తిలోనూ అత్యంత కీలకంగా ఉంటాయి. ఈ నూతన అలా్ట్ర హై పెర్‌ఫార్మెన్స్‌ 19 అంగుళాలు మరియు 20 అంగుళాల రిమ్‌ సైజ్‌ టైర్లు ను కాంటి స్పోర్ట్‌ కాంటాక్ట్‌ 5 మరియు కాంటిస్పోర్ట్‌ కాంటాక్ట్‌ 5 ఎస్‌యువీ ప్రొడక్ట్‌ లైన్స్‌ నుంచి ఉత్పత్తి చేస్తున్నారు. ఈ టైర్లను భారతీయ రోడ్లపై అత్యంత సవాల్‌తో కూడిన పరిస్ధితులలో సైతం తట్టుకునేలా తీర్చిదిద్దారు. ఈ టైర్లు అత్యుత్తమ సర్ఫేస్‌ ఏరియాను రోడ్డుతో పాటుగా కలిగి ఉంటాయి. ఇది మారుతున్న రోడ్డు పరిస్ధితులకు అనుగుణంగా స్పందించే సామర్ధ్యం అందించడంతో పాటుగా అసాధారణ ట్రాక్షన్‌ అందిస్తూనే మెరుగైన కార్నరింగ్‌ భద్రతను సైతం అందిస్తుంది.

అతి సులభంగా కార్యకలాపాలు నిర్వహించడంతో పాటుగా లాభదాయకత మెరుగుపరచడం కోసం డిజిటల్‌ పరిష్కారాలు

వినియోగదారుల లక్ష్యిత విధానంతో, కాంటినెంటల్‌ ఇప్పుడు వాణిజ్య వాహనాలు, భారతదేశంలోని ఫ్లీట్‌ యజమానుల కోసం వినూత్నమైన నాణ్యతా పరిష్కారాలను తీసుకువస్తుంది. దీనిలో భాగంగా, ఈ కాంటినెంటల్‌ యొక్క నూతన డిజిటల్‌ పరిష్కారాలు డిజిటల్‌ టైర్‌ మానిటరింగ్‌ను వేగంగా ప్రారంభించడంతో పాటుగా సౌకర్యవంతంగానూ మారుస్తుంది. తద్వారా టైర్‌ పనితీరు, లాభదాయకత కూడా గణనీయంగా వృద్ధి చెందుతుంది.

ఈ డిజిటల్‌ పరిష్కారాలు, కాంటి 360 సొల్యూషన్స్‌లో భాగం. భారతీయ వాణిజ్య వాహనాల కోసం సమగ్రమైన, సంపూర్ణమైన ఆటోమేటెడ్‌ ఆఫరింగ్‌ ఇది. ఈ సొల్యూషన్స్‌లో సెన్సార్లు ఉన్నాయి. ఇవి 24 గంటలూ టైర్లను రోడ్ల మీద పర్యవేక్షిస్తాయి.దీనిద్వారా వినియోగదారులు తమ వాహనాలను వాస్తవ సమయంలో రిమోట్‌గా కూడా పర్యవేక్షించవచ్చు. ఈ డాటా సహాయంతో టైర్‌ స్టాటస్‌ విజిబిలిటీ మెరుగుపరుచుకోవడం వీలవుతుంది. దీనివలకల వాహన రోడ్డు భద్రత మెరుగుపడటంతో పాటుగా టైర్‌ సంబంధిత నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడమూ సాధ్యమవుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News