- Advertisement -
అధికారులను ఆదేశించిన సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పంట కొనుగోలు కేంద్రాలను జూన్ 8 వరకు కొనసాగించనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ప్రకటించారు. మొదట ఈ నెల 31వరకే కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు వచ్చే నెల 8వ తేదీ వరకు కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని సిఎం కెసిఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షాలు రాకముంగే రైతులు తమ పంటలను కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకోవాలని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో సిఎం కోరారు.
- Advertisement -