Friday, April 26, 2024

గురజాడ పురస్కారం.. వివాదంలో చిక్కుకున్న చాగంటి కోటేశ్వరరావు

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ పురస్కారంపై వివాదం నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ప్రవచనకర్తగా పేరుపొందిన విషయం తెలిసిందే. ఈ నెల 30 తేదీన గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా చాగంటి కోటేశ్వరరావుకు అవార్డు ప్రదానం చేయాలని నిర్వాహకులు అనుకున్నారు. ప్రస్తుతం దీనిపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. గురజాడ గౌరవయాత్ర పేరుతో సాహితీ, సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. గురజాడ అవార్డును చాగంటికి ఇవ్వడం సరికాదని నినాదాలు చేశారు. విజయ నగర పట్టణంలోని గురజాడ విగ్రహం వద్ద పలువురు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News