Friday, April 26, 2024

కో-ఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ హత్య..

- Advertisement -
- Advertisement -

Cooperative Bank Manager murdered in Pune

పుణే: జున్నార్ తహసీల్‌లో బుధవారం బ్యాంకు దోపిడీ సందర్భంగా కోఆపరేటివ్ బ్యాంకు మేనేజర్ చంపివేతకు గురయ్యాడని పోలీసులు తెలిపారు. హతుడిని రాజేందర్ భోర్(50)గా గుర్తించారు. తండలి గ్రామంలోని అనంత్ బిగర్ సేటి సహకారి పట్‌ సంస్థా వద్ద మధ్యాహ్నం 1.50 గంటలకు ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీస్ స్టేషన్ అధికారి నారాయణ్‌గావ్ తెలిపారు.
“హెల్మెట్ ధరించిన ఇద్దరు అగంతకులు బ్యాంకులోకి ప్రవేశించగానే కాల్పులు జరిపి, కొంత డబ్బు తీసుకుని ఉడాయించారు. ఆ సందర్భంలో రాజేందర్ భోర్‌కు బుల్లెట్లు తగిలాయి. అతని ఆసుపత్రికి తీసుకెళ్లే సమయానికి చనిపోయాడు” అని పోలీస్ అధికారి తెలిపారు. దొంగలు దాదాపు రూ.2 లక్షల రొక్కం వరకు బ్యాంకు నుంచి ఎత్తుకెళ్లారని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అభినవ్ దేశ్‌ముఖ్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.

Cooperative Bank Manager murdered in Pune

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News