Friday, April 26, 2024

ముక్కు టీకా వచ్చింది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రానికి కరోనా బూస్టర్ డోసులు సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్‌రావు కో రారు. కరోనా పరిస్థితులు రాష్ట్రాల సన్నద్ధతపై కేంద్ర వైద్యరోగ్య శాఖ మంత్రి మనసుక్ మాండవీయ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన వీడియో సమీక్షలో మంత్రి హరీశ్‌రావు, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బం గా మంత్రి పలు విజ్ఞప్తులు చేశారు. కోవ్యాక్సిన్ 8 లక్షలు, కోవిషీల్డ్ 80 వేలు, ఉండగా కోర్బివాక్స్ డోసులు సున్నా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో బూస్టర్ వేగవంతం చేసిందుకుగాను అవసరమైన వ్యాక్సిన్‌లను రాష్ట్రానికి సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు.

బూస్టర్ డోసు విషయంలో జాతీయ సగ టు 23 శాతం ఉండగా.. తెలంగాణ సగటు 48 శాతంగా మెరుగైన స్థితిలో ఉందన్నారు. సిఎం కెసిఆర్ నిత్య పర్యవేక్షణ, అప్రమత్తత చేయడం, ప్రజ ల్లో అవగాహన పెంచడంతో ఇది సాధ్యమైందన్నా రు. ప్రపంచదేశాల్లో ఓమిక్రాన్ సబ్ వేరియంట్ బిఎఫ్ 7 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, వైరస్ లక్షణాలు, వ్యాప్తి తీరు, ప్రభావం, చికిత్స వంటి అంశాల గురించి రాష్ట్రాలకు తెలియజేయాలని, ఈ అవగాహనతో మరింత అప్రమత్తంగా ఉండడం సాధ్యం అవుతుందని హరీశ్‌రావు అన్నారు. గత అనుభవాల దృష్ట్యా ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
ఇందులో భాగంగా ఆక్సిజన్ ప్లాం ట్స్‌లను సమీప ఆసుపత్రులతో అనుసంధానం చేసే లా మ్యాపింగ్ చేసే విధానాన్ని తీసుకురావాలన్నారు.

యాన్యువల్ మెంటెనెన్స్ కాంట్రాక్ట్ లేకపోవడంతో కేంద్రం నుంచి వచ్చిన వెంటిలేటర్లు, పిఎస్‌ఎ ప్లాంట్స్ మరమ్మతులు జరగటం లేదని, వాటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముందస్తు చర్యలో భాగగా రాష్ట్రాల్లో అవసరమైన వైద్య సదుపాయాలు మెరుగు పరిచేందుకు ఇసిఆర్ పి -3 (ఎమర్జెన్సీ కోవిడ్ రెస్పాన్స్ ప్యాకేజ్ -3) రూపొందించే విషయమై ఆ లోచించాలన్నారు. సమీక్షలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతామహంతి, టిఎస్‌ఎంఎస్‌ఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండి చంద్రశేఖర్‌రెడ్డి, డిఎంఇ రమేష్‌రెడ్డి, డిహెచ్ శ్రీనివాస్‌రావు, టివివిపి కమిషనర్ అజయ్‌కుమార్, సీఎం ఓఎస్డీ గంగాధర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News