- Advertisement -
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా 10,360కి పైగా కరోనా కేసులు నమోదయ్యినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈరోజు కొత్తగా 1,211 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా, 31 మంది చనిపోయారని ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. ఇప్పటి వరకు 2 లక్షల 37 వేలకు పైగా పరీక్షలు చేశామని, ఐసిఎంఆర్ ల్యాబ్ ల్లో 18 వేలకు పైగా పరీక్షలు చేశామని చెప్పారు. ఇక, 1030 మంది కరోనా బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు ఆయన తెలిపారు.
Corona Cases Rising to 10,360 in India
- Advertisement -