- Advertisement -
న్యూఢిల్లీ : కరోనా ప్రభావం పై జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. కరోనా ప్రభావం నుంచి నెమ్మదిగా బయటపడుతున్నాం అన్నారు. ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందని, కరోనా మరణాల రేటు తగ్గిందని చెప్పారు. పండగవేళ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోడీ దేశ ప్రజలకు సూచించారు దేశంలో 90 లక్షల కరోనా బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. కరోనా భయం ఇంకా పోలేదని గుర్తుపెట్టుకోవాలని ప్రజలకు సూచించారు. కరోనా వైరస్ తో భారత్ సమర్ధవంతంగా పోరాడుతోందని చెప్పారు. కరోనా వ్యాప్తిని అరికట్టగలిగామని తెలిపారు. కరోనా వైరస్ పట్లా చాలా మంది ఉదాసీనంగా ఉన్నారున్నారు. అమెరికా, బ్రెజిల్ తో పోలిస్తే మన దగ్గర మెరుగైన పరిస్థితి ఉందన్నారు. ప్రజలు మాస్క్ లేకుండా బయట తిరుగుతున్నారని, ఇలా అయితే కరోనా విజృంభించే అవకాశం ఉన్నదని మోడీ స్పష్టం చేశారు.
- Advertisement -