Thursday, April 18, 2024

కరోనా@32000 మృతులు

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: భారత దేశంలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. గత వారం రోజుల నుంచి ప్రతి రోజు దాదాపుగా 50 వేల కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఒక్క రోజే 48661 కేసులు నమోదుకాగా 705 మంది మృత్యువాతపడ్డారు. కరోనాతో మృతుల సంఖ్య 32100కు చేరుకుంది. భారత్ లో కరోనా వైరస్ 13.85 లక్షల మంది సోకింది. కరోనా నుంచి 8.86 లక్షల మంది కోలుకోగా 4.66 మంది ప్రస్తుతం కొన్ని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మహానగరాలలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ముంబయి, థానే, పూనే, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహా నగరాలను కరోనా వణికిస్తోంది. ప్రపంచంలో కరోనా కేసులు సంఖ్య ఒక కోటి 62 లక్షలకు చేరుకోగా 6.48 లక్షల మంది బలయ్యారు. కరోనా వైరస్ ధాటికి అమెరికా, బ్రెజిల్, రష్యా వంటి అగ్ర రాజ్యాలు కూడా చిగురుటాకులా వణికిపోతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News